Nirmala Sitharaman: ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ, ఈ-పాస్ పోర్టులు.. కేంద్ర బడ్జెట్ హైలైట్స్ -2

2022 union budget highlights
  • రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం
  • బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ
  • పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

  • ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైంది.
  • రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం.
  • ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నాం.
  • 2 లక్షల అంగన్ వాడీలలో వసతులను మెరుగుపరుస్తాం.
  • ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను పెంచుతున్నాం.
  • డిజిటల్ పేమెంట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్ల ఏర్పాటు.
  • బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీ.
  • అత్యాధునిక టెక్నాలజీతో చిప్ ఉన్న ఈ-పాస్ పోర్టులు.
  • 8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు. 
  • కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్.
  • 2022-23లో 5జీ సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తాయి.
  • 2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం.
  • అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తో అనుసంధానం చేస్తాం.
  • రక్షణ రంగానికి కావాల్సిన వాటిని 68 శాతం దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటాం. రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం. 
  • పురుగు మందుల వినియోగం కోసం డ్రోన్ల సహకారం.
  • యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
  • పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం.
  • ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ.
  • అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత వ్యవస్థను తీసుకొస్తాం.
  • బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకం.
  • విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు.

  • Loading...

More Telugu News