Jeevan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేసీఆరే అడ్డుకున్నారు: జీవన్ రెడ్డి

Jeevan Reddy slams CM KCR over Kaleswaram Project
షార్ట్స్‌లో చూడండి
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Jeevan Reddy
CM KCR
Kaleswaram Project
Congress
Telangana

More Telugu News