కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీలో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు
- ఏపీలో ఇక 26 జిల్లాలు
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు
- ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సజ్జల
- వైసీపీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నూతన జిల్లాల ఏర్పాటుపై మరికొన్ని వివరాలు తెలిపారు. కొత్త జిల్లాల అంశాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలో నేటి నుంచి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు మూడ్రోజుల పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు తమ పరిధిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ప్రజల ఆకాంక్షలను సీఎం జగన్ గౌరవించారని తెలిపారు.