Maruprolu Jaswanth Reddy: వీరమరణం పొందిన తెలుగు జవాను జశ్వంత్ రెడ్డికి 'శౌర్య చక్ర'

  • గతేడాది జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్
  • ఓ ఉగ్రవాదిని చంపిన జవాను జశ్వంత్ రెడ్డి
  • తన టీమ్ కమాండర్ ప్రాణాలు కాపాడిన వైనం
  • తీవ్రగాయాలతో జశ్వంత్ రెడ్డి మృతి
Shaurya Chakra to Sepoy Jaswanth Reddy

గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన మరుప్రోలు జశ్వంత్ రెడ్డి గతేడాది జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరులో అమరుడయ్యాడు. రాజౌరిలో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టిన జశ్వంత్ రెడ్డి తీవ్రగాయాలతో వీరమరణం పొందాడు.

నాటి టెర్రర్ ఆపరేషన్ సందర్భంగా తన టీమ్ కమాండర్ ప్రాణాలు కాపాడిన ఈ యువ సిపాయి తాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో జశ్వంత్ రెడ్డికి కేంద్రం మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం ప్రకటించింది. జశ్వంత్ రెడ్డి 2016లో సైన్యంలో చేరాడు. మద్రాస్ రెజిమెంట్ లో శిక్షణ పొంది, తొలుత నీలగిరి వద్ద విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ కు బదిలీపై వెళ్లాడు.

More Telugu News