ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత
- గుండెపోటుతో మృతి
- ఆసుపత్రికి తీసుకెళుతుండగా తుదిశ్వాస విడిచిన సిద్ధాంతి
- గతంలో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు
ఆయన పూర్తిపేరు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్. ఆయన స్వస్థలం గుంటూరు. అయితే హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.... ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగా మారకముందే ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు. పలువురు సినీ కమెడియన్లతో కలిసి అంతర్జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో జ్యోతిష్యం, వాస్తు, పంచాంగం అంశాల్లో రాణించారు. ఆయనకు శ్రీశైలంలో ఆశ్రమం కూడా ఉంది.