అండర్-19 ప్రపంచకప్: దుమ్మురేపుతున్న యువ భారత్.. ఉగాండాపై 326 పరుగుల భారీ తేడాతో విజయం
23-01-2022 Sun 08:58
- ఇప్పటికే క్వార్టర్స్కు చేరిన భారత్
- ప్రత్యర్థి బౌలింగును చీల్చి చెండాడిన బ్యాటర్లు
- సెంచరీలతో చెలరేగిన రఘువంశీ, రాజ్బవా
- 79 పరుగులకే కుప్పకూలిన ఉగాండా

అండర్-19 ప్రపంచకప్లో భారత యువజట్టు చెలరేగిపోతోంది. ఇప్పటికే క్వార్టర్స్కు చేరుకున్న భారత జట్టు నిన్న పసికూన ఉగాండాతో జరిగిన చివరి గ్రూప్-బి మ్యాచ్లో మరోమారు దుమ్మురేపింది. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. భారత బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
ఓపెనర్ రఘువంశీ 120 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 144 పరుగులు చేయగా, రాజ్ బవా 108 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 162 పరుగులు సాధించాడు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు రాకెట్లా దూసుకుపోయింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉగాండా బౌలర్లలో కెప్టెన్ పాస్కల్ మురుంగి 72 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్టోఫర్ కిడేగా, యూనుసు చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 406 పరుగుల కొండంత విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు 326 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ పాస్కల్ చేసిన 34 పరుగులే అత్యధికం. జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేకపోయారు. భారత బౌలర్లలో కెప్టెన్ నిశాంత్ సింధు నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రాజవర్ధన్ 2 వికెట్లు పడగొట్టగా వాసు వత్స్, విక్కీ చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాట్తో విరుచుకుపడి అజేయ సెంచరీతో ఆకట్టుకున్న రాజ్ బవాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఓపెనర్ రఘువంశీ 120 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 144 పరుగులు చేయగా, రాజ్ బవా 108 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 162 పరుగులు సాధించాడు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు రాకెట్లా దూసుకుపోయింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉగాండా బౌలర్లలో కెప్టెన్ పాస్కల్ మురుంగి 72 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్టోఫర్ కిడేగా, యూనుసు చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 406 పరుగుల కొండంత విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు 326 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ పాస్కల్ చేసిన 34 పరుగులే అత్యధికం. జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేకపోయారు. భారత బౌలర్లలో కెప్టెన్ నిశాంత్ సింధు నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రాజవర్ధన్ 2 వికెట్లు పడగొట్టగా వాసు వత్స్, విక్కీ చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాట్తో విరుచుకుపడి అజేయ సెంచరీతో ఆకట్టుకున్న రాజ్ బవాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
More Telugu News



తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
14 minutes ago

ఢిల్లీలో అఖిలేశ్ యాదవ్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం
37 minutes ago

ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో విడుదల
47 minutes ago


ఒమిక్రాన్ బీఏ 4 రెండో కేసు తమిళనాడులో
1 hour ago

దసరా రేసులో నిఖిల్ .. 'స్పై'
2 hours ago

పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్!
3 hours ago

కొండెక్కుతోన్న టమాటా ధరలు
3 hours ago
Advertisement
Video News

Sarkaru Vaari Paata team: Unfiltered conversation between Mahesh Babu and fans
13 minutes ago
Advertisement 36

Cong fighting to regain India from BJP-RSS, says Rahul at Cambridge varsity
28 minutes ago

Apart from entertainment, movies should impart knowledge: Venkaiah
54 minutes ago

Yoddha song Telugu teaser from Prithviraj - Akshay Kumar, Manushi
1 hour ago

Pawan Kalyan laughs as power goes off while interacting with media
2 hours ago

Full video song ‘Meenaacchee’ from Bhala Thandhanana ft. Sree Vishnu, Catherine Tresa
3 hours ago

Black official trailer- Aadi Sai Kumar
3 hours ago

KA Paul 'Open Heart With RK'- Promo
4 hours ago

7 AM Telugu News: 21st May 2022
5 hours ago

Case filed against Amitabh, Shah Rukh, Ajay Devgn, Ranveer for promoting ‘Gutkha’: Key details
5 hours ago

CM KCR national tour schedule released
6 hours ago

Elon Musk facing se*ual harassment on a flight attendant
6 hours ago

Zee Mahotsavam 2022 Promo- Venkatesh, Varun Tej, Anil Ravipudi- May 22nd, 6 PM
7 hours ago

Did not start the fight: Superstar Kichcha Sudeep on language row
7 hours ago

9 PM Telugu News- 20th May 2022
15 hours ago

Corona Virus BA 4 variant; First case witnessed in Hyderabad
16 hours ago