భారత్ లోనే ఐపీఎల్-2022... బీసీసీఐ ధీమా
- వర్చువల్ సమావేశం నిర్వహించిన బీసీసీఐ
- హాజరైన ఐపీఎల్ పాలకమండలి, ఫ్రాంచైజీల యజమానులు
- ఐపీఎల్ వేదికపై సమీక్ష
- మార్చి 27 నుంచి భారత్ లో నిర్వహించేందుకు నిర్ణయం!
ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రజేశ్ పటేల్ మాట్లాడుతూ, ఐపీఎల్-2022 సీజన్ సొంతగడ్డపైనే మార్చి 27న ప్రారంభం అవుతుందని సూచనప్రాయంగా వెల్లడించారు. నేటి సమావేశానికి హాజరైన ఓ అధికారి స్పందిస్తూ, ముంబయి, పూణే నగరాల్లో పలు మైదానాలు ఉన్నందున, కొత్త సీజన్ లో పోటీలు ఆ రెండు నగరాల్లో నిర్వహించే వీలుందని తెలిపారు.