కాసినో వ్యవహారంలో కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన టీడీపీ నేతలు
- గుడివాడ కాసినో రగడ
- మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల పోరు
- కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
- చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞాపన
కాగా, టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నిన్న గుడివాడ వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై పోలీసులు నేడు కేసులు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో పాటు మరో 26 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల్లో తోట నాగరాజు, మరో 19 మందిపై కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని ఓఎస్డీ శశిభూషణ్ పైనా కేసు నమోదైంది.