అధికారంలోకి రావడం కోసం 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్.. సీఎం అయ్యాక జనాల్లోకి రావడం లేదు: బీజేపీ నేత అరుణ్ సింగ్
- ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా కలవడం లేదు
- మోదీ పథకాలకు జగన్ తన లేబుల్ వేసుకుంటున్నారు
- బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు
అధికారంలోకి రావడం కోసం 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్... సీఎం అయిన తర్వాత జనంలోకి రావడం లేదని అరుణ్ సింగ్ దుయ్యబట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా జగన్ కలవడం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే... జగన్ తన లేబుల్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కర్నూలులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.