జగన్ అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ!
- పీఆర్సీపై ప్రధానంగా చర్చించే అవకాశం
- సినిమా టికెట్లపై కూడా చర్చిస్తారని సమాచారం
- పాఠశాలలను కొనసాగించే అంశంపై చర్చించే అవకాశం
ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పీఆర్సీతో పాటు, సినిమా టికెట్ల అంశంపై కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న తరుణంలో దీనిపై కూడా చర్చించబోతున్నారు. పాఠశాలలను కొనసాగించే అంశంపై కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. పలు సమస్యల నేపథ్యంలో రేపటి కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.