హిందూ ధర్మంపై దేశంలోనే తొలి కోర్సు.. బనారస్ యూనివర్సిటీలో ప్రారంభం
- రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు
- యూనివర్సిటీ ఏర్పాటైన వందేళ్ల తర్వాత ప్రారంభం
- 45 మంది విద్యార్థుల చేరిక
ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగం ద్వారా ఈ కోర్సును అందిస్తోంది. యూనివర్సిటీకి చెందిన భారత్ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్, ప్రొఫెసర్ సదాశివ కమార్ ద్వివేది దీని గురించి మాట్లాడుతూ.. ఒక విదేశీ విద్యార్థి సహా మొత్తం 45 మంది విద్యార్థులు ఈ కోర్సు మొదటి బ్యాచ్ లో చేరినట్టు తెలిపారు. రెండేళ్ల కోర్సు, నాలుగు సెమిస్టర్లుగా, 16 పేపర్లతో ఉంటుందన్నారు.
ఇక ఈ కోర్సును మంగళవారం నాడు యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ వీకే శుక్లా ప్రారంభించారు. నూతన విద్యా విధానం 2020 కింద ఈ కోర్సు ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, 1916లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పాటు కాగా.. హిందూ ధర్మంపై కోర్సు తీసుకురావడానికి వందేళ్లకు పైగా పట్టింది.