కోవిడ్ మరణాలు రికార్డుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.. పరిహారం కోరుతూ దరఖాస్తుల వెల్లువ!
19-01-2022 Wed 09:54
- గుజరాత్ లో 9 రెట్లు అధికంగా దరఖాస్తులు
- తెలంగాణలో 7 రెట్లు అధికంగా బాధితులు
- మెజారిటీ రాష్ట్రాల్లో ఇదే తీరు
- ఆసుపత్రుల బయటే ఎక్కువ మరణాలు

కరోనాతో మరణించినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న గణాంకాల కంటే.. నిజంగా ఈ వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశించింది. ఈ అంశంలో అత్యున్నత న్యాయస్థానం తన పర్యవేక్షణను కొనసాగిస్తోంది.
సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఫైల్ చేసిన వివరాలను పరిశీలిస్తే.. తెలంగాణలో 4,100కు పైగా మరణించినట్టు రాష్ట్ర సర్కారు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, కరోనా పరిహారం కోసం 29,969 దరఖాస్తులు (సుమారు 7 రెట్లు) వచ్చాయి. ఇప్పటికే 12వేలకు పైగా కేసుల్లో పరిహారం చెల్లించడం పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య 15 వేల స్థాయిలో ఉంటే పరిహారం కోసం 36 వేలకు పైనే దరఖాస్తులు వచ్చాయి. 11,464 దరఖాస్తుదారులకు పరిహారం మంజూరైంది. ఇక గుజరాత్ లో అధికారిక కరోనా మృతులు 10 వేలు ఉంటే పరిహారం కోసం 90 వేల దరఖాస్తులు (9 రెట్లు) వచ్చాయి. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో మృతుల సంఖ్యకు మించి పరిహారానికి దరఖాస్తులు వచ్చాయి.
కరోనాతో ఆసుపత్రుల్లో మరణించిన వారి పేర్లే రికార్డులకు ఎక్కాయి. ఆసుపత్రి బయట కరోనాతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోగా, వారి వివరాలు గణాంకాల్లోకి చేరలేదని.. ఇప్పుడు దరఖాస్తులు ఎక్కువగా రావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ గా తేలిన తర్వాత నెల రోజుల్లోపు మరణించిన అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీంతో కరోనా పాజిటివ్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారికి సంబంధించి కూడా పరిహారం ఇవ్వాల్సి వస్తుంది.
మరోవైపు ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అధికారిక మృతుల సంఖ్యతో పోలిస్తే పరిహారానికి వచ్చిన దరఖాస్తులు తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడమేనని తెలుస్తోంది.
సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఫైల్ చేసిన వివరాలను పరిశీలిస్తే.. తెలంగాణలో 4,100కు పైగా మరణించినట్టు రాష్ట్ర సర్కారు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, కరోనా పరిహారం కోసం 29,969 దరఖాస్తులు (సుమారు 7 రెట్లు) వచ్చాయి. ఇప్పటికే 12వేలకు పైగా కేసుల్లో పరిహారం చెల్లించడం పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ లో మృతుల సంఖ్య 15 వేల స్థాయిలో ఉంటే పరిహారం కోసం 36 వేలకు పైనే దరఖాస్తులు వచ్చాయి. 11,464 దరఖాస్తుదారులకు పరిహారం మంజూరైంది. ఇక గుజరాత్ లో అధికారిక కరోనా మృతులు 10 వేలు ఉంటే పరిహారం కోసం 90 వేల దరఖాస్తులు (9 రెట్లు) వచ్చాయి. దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో మృతుల సంఖ్యకు మించి పరిహారానికి దరఖాస్తులు వచ్చాయి.
కరోనాతో ఆసుపత్రుల్లో మరణించిన వారి పేర్లే రికార్డులకు ఎక్కాయి. ఆసుపత్రి బయట కరోనాతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోగా, వారి వివరాలు గణాంకాల్లోకి చేరలేదని.. ఇప్పుడు దరఖాస్తులు ఎక్కువగా రావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ గా తేలిన తర్వాత నెల రోజుల్లోపు మరణించిన అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీంతో కరోనా పాజిటివ్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారికి సంబంధించి కూడా పరిహారం ఇవ్వాల్సి వస్తుంది.
మరోవైపు ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అధికారిక మృతుల సంఖ్యతో పోలిస్తే పరిహారానికి వచ్చిన దరఖాస్తులు తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడమేనని తెలుస్తోంది.
More Telugu News

బుకర్ ప్రైజ్ తో చరిత్ర సృష్టించిన గీతాంజలి శ్రీ
8 minutes ago


హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను అడ్డుకున్న పోలీసులు!
54 minutes ago



తమిళ భాష శాశ్వతమైనది: ప్రధాని మోదీ
15 hours ago

తెలంగాణలో 47 మందికి కరోనా పాజిటివ్
15 hours ago


మోదీ ముందే తమిళ వాదం వినిపించిన సీఎం స్టాలిన్
16 hours ago

బాలయ్య సరసన ఛాన్స్ ఆమెకి దక్కిందట!
16 hours ago

ఐఎస్బీపై చంద్రబాబు ట్వీట్లపై ప్రశంసల హోరు!
16 hours ago

ఫైట్లు చేయడం ఈజీ .. కామెడీనే కష్టం: వరుణ్ తేజ్
16 hours ago

చరణ్ సినిమాకి శంకర్ ఖరారు చేసిన టైటిల్ ఇదేనా?
17 hours ago


'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ వాయిదా!
17 hours ago
Advertisement
Video News

TDP Mahanadu: Dent to AP’s image in YSRCP rule, says Chandrababu
8 minutes ago
Advertisement 36

Vikram Hitlist: Lyrical song Mathuga Mathuga ft. Kamal Haasan, Vijay Sethupathi
54 minutes ago

Police stops TDP MLA Balakrishna’s convoy in Sri Sathya Sai district
1 hour ago

Trailer: 777 Charlie featuring Rakshit Shetty
1 hour ago

Ongole: Nara Lokesh makes grand entry at TDP Mahanadu
1 hour ago

Live: TDP Mahanadu at Ongole
2 hours ago

Promo: ‘Kumkumala’ Telugu song from Brahmastra Part One: Shiva – Ranbir, Alia
2 hours ago

Amalapuram violence: 19 held
2 hours ago

Viral video: Passengers break into Garba as train arrives early; interesting sight
3 hours ago

7 AM Telugu News- 27th May 2022
3 hours ago

Ante Sundaraniki Bloopers- Nani, Nazriya
4 hours ago

All set for TDP Mahanadu two-day event at Ongole
4 hours ago

"Who's Jay Shah to...?" Chief Minister KCR's party counters PM's charge
5 hours ago

Inside videos of Karan Johar's 50th birthday bash is all fun and starry- Salman Khan, SRK, Kajol
5 hours ago

Jabardasth latest promo - 2nd June 2022 - Anasuya, Chalaki Chanti, Rocket Raghava
6 hours ago

Day-4 for Telangana delegation led by Minister KTR at World Economic Forum
13 hours ago