చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ అయ్యప్పస్వామి ఆలయంలో పూజలు చేసిన అయ్యన్నపాత్రుడు
- చంద్రబాబుకు కరోనా పాజిటివ్
- చంద్రబాబుకు కరోనా రావడం బాధాకరమన్న అయ్యన్న
- నర్సీపట్నం ఆలయంలో కొబ్బరికాయలు కొట్టిన నేత
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అని, ఆయనకు కరోనా రావడం బాధాకరమని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చంద్రబాబుకు అయ్యప్పస్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా పాలన చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.