Mahesh Babu: మహేశ్ కోసం రంగంలోకి బాలీవుడ్ విలన్!

  • మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • ఆల్రెడీ ముగింపు దశకి చేరుకున్న మూవీ
  • త్వరలో పట్టాలపైకి త్రివిక్రమ్ సినిమా 
  • కథానాయికగా పూజ హెగ్డే
Sunil Shetty in Mahesh Babu Movie

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే మిగతా చిత్రీకరణను పూర్తిచేయనున్నారు. మోకాలు సర్జరీ నుంచి మహేశ్ కోలుకోగానే తాజా షెడ్యూల్ మొదలుకానుంది.

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే నటించనుంది. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది.

ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్ రవిచంద్రన్ ను తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ పాత్ర కోసం సునీల్ శెట్టిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తారట. ఇక మిగతా పాత్రల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News