బైకుపై వెళుతున్న వ్యక్తి ప్రాణం తీసిన గాలిపటం మాంజా
- మంచిర్యాలలో ఘటన
- భార్యతో కలిసి బైక్ పై వెళుతున్న వ్యక్తి
- మార్గమధ్యంలో గొంతుకు చిక్కుకున్న మాంజా
- గొంతును కోసేసిన మాంజా
మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది. భీమయ్య (36) అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్ పై వెళుతుండగా గాలిపటం మాంజా గొంతుకు చిక్కుకుంది. ఆ మాంజా భీమయ్య గొంతును కోసేసింది. బైక్ పై వెళుతున్నందున గొంతు లోతుగా తెగడంతో మరణం సంభవించింది. ఈ ఘటనతో భీమయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.