Makara Jyothi: శబరిమలలో దర్శనమిచ్చిన అయ్యప్య మకరజ్యోతి

  • భక్తులకు మకరవిళక్కు దర్శనం
  • పులకించిన భక్త జనం
  • అయ్యప్ప నినాదాలతో హోరెత్తిన శబరిమల
Ayyappa Makara Jyothi appears at Sabarimala

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్పస్వామి మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఈ సాయంత్రం పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో హోరెత్తించారు. కాగా, ఈ నెల 20న శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మూసివేయనున్నారు.  ప్రతి ఏడాది సంక్రాంతి నాడు మకరజ్యోతి దర్శనం ఆనవాయతీగా వస్తోంది. దీన్నే మకరవిళక్కు అని పిలుస్తారు. జ్యోతి కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చి అదృశ్యమవుతుందని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు చెబుతుంటారు.

More Telugu News