Vishal: 'సామాన్యుడు' నుంచి సాంగ్ రిలీజ్!

  • 'సామాన్యుడు'గా విశాల్ 
  • ఆయన జోడీగా డింపుల్ హయతి 
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
Samanyudu Song Released

విశాల్ కథానాయకుడిగా తమిళంలో 'వీరమే వాగై సూదుమ్' సినిమా రూపొందింది. విశాల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహించాడు. డింపుల్ హయతి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, తెలుగులో 'సామాన్యుడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.  

"మత్తెక్కించే కళ్లే .. పిచ్చెక్కించే చూపే .. " అంటూ ఈ పాట సాగుతోంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ .. రొమాన్స్ .. వాళ్ల సరదాలు .. షికార్లకి సంబంధించిన విజువల్స్ పై ఈ సాంగ్ ను కట్ చేశారు. ఈ పాట చూస్తుంటే .. ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ తో పాటు, రొమాన్స్ పాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తోంది.

తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా తమిళనాట థియేటర్లు మూతపడుతూ ఉండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో విశాల్ ఉన్నాడు.

  • Loading...

More Telugu News