Somu Veerraju: భోగి మంటల ద్వారా నిరసన వ్యక్తం చేసిన సోము వీర్రాజు

  • జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్న వీర్రాజు
  • దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపాటు
  • రాజమండ్రిలో భోగి మంటలు వేసిన వీర్రాజు
Somu Veerraju protests against govt by bon fire

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల ఆలయాలు, వాటి ఆస్తులపైనా, హిందువులపైనా దాడులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ దాడులను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. న్యాయం చేయడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ రాజమండ్రిలో భోగి మంటల ద్వారా నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News