Raghu Rama Krishna Raju: హైదరాబాదులోని ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు

ap cid reaches raghuramas home
  • రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు వ‌చ్చిన పోలీసులు  
  • రేపు ర‌ఘురామ‌ విచారణకు రావాలని నోటీసులు
  • నోటీసులు త‌న‌కు ఇచ్చి వెళ్లాల‌న్న ర‌ఘురామ కుమారుడు
  • అందుకు ఒప్పుకోని ఏపీ సీఐడీ పోలీసులు
హైద‌రాబాద్‌, గచ్చిబౌలిలోని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ‌రాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు వ‌చ్చామ‌ని వారు తెలిపారు. రేపు ర‌ఘురామ‌ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఆ నోటీసులు త‌న‌కు ఇచ్చి వెళ్లాల‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కుమారుడు సీఐడీ అధికారుల‌ను కోరారు. అందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఒప్పుకోలేదు. ఆ నోటీసుల‌ను ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకే ఇస్తామ‌ని చెప్పారు. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

మరోపక్క, రేపు న‌ర‌సాపురానికి వ‌స్తాన‌ని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. రెండు రోజుల పాటు న‌ర‌సాపురంలో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని ఆయ‌న ఇంటికి వ‌చ్చిన ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని గ‌తంలో కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనిపైనే విచార‌ణ జ‌రుగుతోంది.
Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh

More Telugu News