కుప్పం గనుల అక్రమ తవ్వకాలపై విచారణ జరుపుతాం: మంత్రి బొత్స
- కుప్పంలో ఇటీవల చంద్రబాబు పర్యటన
- గనులు పరిశీలించిన టీడీపీ అధినేత
- వైసీపీ నేతలు దోచుకుంటున్నారని వ్యాఖ్యలు
- చంద్రబాబు ఎన్నింటిపై విచారణ జరిపించాడన్న బొత్స
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పలు గనులను పరిశీలించారు. ప్రకృతి వనరులను ఎక్కడ కొల్లగొడితే అక్కడ మకాం వేసి పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సహజ వనరులు దోచుకుంటూ వైసీపీ నేతలు మాఫియాగా మారారని విమర్శించారు. గనుల దోపిడీకి పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.