Roja: అధ్వానంగా ఉన్న నగరి-పుత్తూరు జాతీయ రహదారిలో టోల్ చార్జీ వసూలు చేయొద్దు: ఎమ్మెల్యే రోజా

  • ఇటీవల భారీ వర్షాలు
  • నగరి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు
  • రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన రోజా
Roja met R and B Dept Special Secretary Krishnababu

చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిశారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని, అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని అన్నారు.

ఈ మేరకు కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు. తన నగరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని రోజా వివరించారు. వెంటనే ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. 

More Telugu News