Mahesh Babu: సంక్రాంతి నుంచే 'సర్కారువారి పాట' సందడి!

  • మహేశ్ తాజా చిత్రంగా 'సర్కారువారి పాట'
  • బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ 
  • సంక్రాంతికి ఫస్టు సింగిల్ రిలీజ్ 
  • ఏప్రిల్ 1వ తేదీన విడుదల    
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ .. 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం మోకాలు సర్జరీ కారణంగా మహేశ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది.

నిజానికి ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. జనవరి 13న రానున్నట్టుగా ప్రకటించారు కూడా. ఆ తరువాత 'ఆర్ ఆర్ ఆర్' వస్తుందని తెలిసి, ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఒక అప్ డేట్ ను వదలనున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ధ్రువీకరించారు కూడా.

పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన చెప్పిన దానికి ప్రకారం చూసుకుంటే, సంక్రాంతి కానుకగా ఫస్టు సింగిల్ రిలీజ్ కానున్నట్టుగా స్పష్టమవుతోంది. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే ఈ కథలో నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఇక ఒక ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్ సందడి చేయనున్నాడు.

More Telugu News