Prabhas: 'రాధేశ్యామ్' టీమ్ పరిశీలనలో కొత్త రిలీజ్ డేట్!

  • ప్రేమకథా చిత్రంగా 'రాధేశ్యామ్'
  • విదేశీ నేపథ్యంలో సాగే కథ
  • హస్తసాముద్రికుడిగా ప్రభాస్
  • మార్చి 18న రిలీజ్ చేసే ఛాన్స్
Radhe Shyam movie update

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రూపొందిన 'రాధేశ్యామ్' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. టి సిరీస్ - యూవీ క్రియేషన్స్  - గోపీకృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా దీనిని నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికంలో ఆరితేరినవాడుగా కనిపించనున్నాడు.

విదేశీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం హీరో చేసే సాహసాలే ఈ సినిమా. అలాంటి ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించి, అందరినీ ఎంతగానో ఊరించింది. భారీస్థాయి ప్రమోషన్స్ తో మరింతగా ఆసక్తిని పెంచింది. కానీ కరోనా తీవ్రత పెరిగిన కారణంగా థియేటర్లు మూతబడుతుండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.

అయితే, ఈ సినిమా విడుదల మళ్లీ ఎప్పుడు వుంటుందనే ఒక ఆసక్తి అందరిలో పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను మార్చి 18వ తేదీన విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త తాజాగా వినిపిస్తోంది. ఆ డేట్ ను లాక్ చేసుకుని, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చునని అనుకుంటున్నారట. 

More Telugu News