ఎయిర్ పోర్టుకు ప్రాణాలతో రాగలిగా.. మీ సీఎంకు థ్యాంక్స్: పంజాబ్ అధికారులతో మోదీ
- మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం
- ఫ్లైఓవర్ పై 20 నిమిషాల సేపు ఆగిపోయిన మోదీ కాన్వాయ్
- అక్కడి నుంచి ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్లిన ప్రధాని
మరోవైపు ఘటన జరిగిన ప్రదేశం నుంచి భతిండా ఎయిర్ పోర్టుకు మోదీ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద ఉన్న రాష్ట్ర అధికారులతో ఆయన మాట్లాడుతూ, 'భతిండా ఎయిర్ పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్' అని అన్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల ప్రధాని మోదీ ఫిరోజ్ పూర్ ర్యాలీ రద్దయింది.