Telangana: తెలంగాణలో మళ్లీ కరోనా ఉద్ధృతి... ఒక్కరోజులో 1000కి పైగా కేసులు

  • గత 24 గంటల్లో 42,991 కరోనా పరీక్షలు
  • 1,052 మందికి కరోనా పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 659 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,858 మందికి చికిత్స
Telangana records thousand plus corona cases in a single day

తెలంగాణలో మరోసారి కరోనా విజృంభణ షురూ అయింది. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,991 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,052 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 659 కొత్త కేసులను గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 116, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 240 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,033కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,84,023 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,75,132 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,858 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News