Amaravati: కార్పొరేషన్ గా మారబోతున్న ఏపీ రాజధాని అమరావతి

  • రాజధానిలోని 19 గ్రామాలతో కార్పొరేషన్   
  • నోటిఫికేషన్ జారీ చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్
  • ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశం
Amaravati to become corporation

ఏపీ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించారు.  

More Telugu News