CM Jagan: రైతు భరోసా మూడో విడత సొమ్ము విడుదల చేసిన సీఎం జగన్

  • గత మూడేళ్లుగా రైతు భరోసా అమలు
  • ఈ ఏడాది మూడో విడత కింద రూ.1,036 కోట్లు విడుదల
  • 50,58,489 మంది రైతులకు లబ్ది
CM Jagan releases third installment of YSR Rythu Bharosa

ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి మూడో విడత నిధులను నేడు విడుదల చేశారు. ఏపీలో వైఎస్సార్ రైతు భరోసా పథకం గత మూడేళ్లుగా అమలవుతోంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల సొమ్మును రైతుల ఖాతాలో జమ చేశారు. తాజాగా మూడో విడత సొమ్ము రూ.1,036 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. 50,58,489 మంది రైతులకు రైతు భరోసాతో లబ్ది చేకూరనుంది.

More Telugu News