Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా

  • జ్వరం, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రేవంత్
  • టెస్టుల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ
  • తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచన
TPCC Chief Revanth Reddy tests corona positive

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. జ్వరం, స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

  • Loading...

More Telugu News