తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా

TPCC Chief Revanth Reddy tests corona positive
  • జ్వరం, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రేవంత్
  • టెస్టుల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ
  • తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచన
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. జ్వరం, స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Go Back to Shorts
Revanth Reddy
TPCC President
Corona Virus

More Telugu News