Somu Veerraju: సినిమా టికెట్ల విష‌యంలో మీ జోక్యం ఎందుకు?: సోము వీర్రాజు వ్యాఖ్య‌లు

  • రాష్ట్రాన్ని ఆదాయ వ‌న‌రుగా చేసుకుని దోపిడీ
  • సినిమా టికెట్ల విష‌యంలో ప్ర‌భుత్వ జోక్యం త‌గ‌దు
  • ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌లు తెలియ‌జేస్తాం
  • ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై బీజేపీ త‌ర‌ఫున భేటీలు
somu veerraju slams ycp

వైసీపీ ప్ర‌భుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులో బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సోము వీర్రాజు ఈ రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంపై స్పందించారు. రాష్ట్రంలో సినిమా టికెట్ల విష‌యంలో ప్ర‌భుత్వ జోక్యం ఎందుకని ప్ర‌శ్నించారు. అందులో జోక్యం చేసుకోవ‌డం స‌రికాద‌ని  సోము వీర్రాజు చెప్పారు.  

కేంద్రం నిధులిస్తే జ‌గ‌న్ సొంత ప‌థ‌కాలుగా ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాష్ట్రాన్ని ఆదాయ వ‌న‌రుగా చేసుకుని వైసీపీ ప్ర‌భుత్వం దోపిడీ చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌లకు తెలియ‌జేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై బీజేపీ త‌ర‌ఫున మండ‌ల స్థాయి భేటీలు నిర్వ‌హిస్తామ‌ని, అన్ని విష‌యాల‌ను వివ‌రించి చెబుతామ‌ని సోము వీర్రాజు అన్నారు.

  • Loading...

More Telugu News