TRS: దళిత, రైతు వ్యతిరేక బీజేపీని బొందపెట్టండి: కడియం శ్రీహరి

bjp will defeat in up elections said Kadiyam Srihari
  • యూపీ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడుతుంది
  • అఖిలేశ్ యాదవ్ దెబ్బకు మోదీ, షా మూతి పగలుతుంది
  • కేసీఆర్ కూటమి కడతారన్న భయంతోనే ఇబ్బందులు
ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడడం ఖాయమని టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దెబ్బకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా మూతి పగలడం ఖాయమని అన్నారు.

తెలంగాణ భవన్‌లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ఓ కూటమిని తయారుచేస్తారన్న భయంతోనే తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. దళితులు, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని బొందపెట్టాలని శ్రీహరి పిలుపునిచ్చారు.
TRS
Uttar Pradesh
Narendra Modi
Amit Shah
Kadiyam Srihari

More Telugu News