షమీకి 5 వికెట్లు... దక్షిణాఫ్రికా 197 ఆలౌట్
- సెంచురియన్ లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
- తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 327 ఆలౌట్
- ఎంగిడికి 6 వికెట్లు
- తొలి ఇన్నింగ్స్ లో తడబడిన సఫారీలు
- కకావికలం చేసిన షమీ, బుమ్రా
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 52 పరుగులతో టెంబా బవుమా టాప్ స్కోరర్ గా నిలిచాడు. డికాక్ 34 పరుగులు చేయగా, లోయరార్డర్ లో రబాడా 25, మార్కో జాన్సెన్ 19 పరుగులు చేశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ చేజార్చుకుంది. 4 పరుగులు చేసిన మయాంక్... మార్కో జాన్సెన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 6 ఓవర్లలో 1 వికెట నష్టానికి 13 పరుగులు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 5, నైట్ వాచ్ మన్ శార్దూల్ ఠాకూర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఆధిక్యం 146 పరుగులకు చేరింది.
కాగా, ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా కుడికాలికి గాయమైంది. మైదానాన్ని వీడిన బుమ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయం తీవ్రత తక్కువేనని వెల్లడైంది. దాంతో బుమ్రా తిరిగి మైదానంలోకి రావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.