Varla Ramaiah: వివేకా హత్య కేసులో సీబీఐ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది: వర్ల రామయ్య

  • 2019లో హత్యకు గురైన వైఎస్ వివేకా
  • దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
  • తస్మాత్ జాగ్రత్త అంటూ వ్యాఖ్యలు
Varla Ramaiah suggests CBI in YS Viveka case

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. వివేకా హత్య కేసులో సీబీఐ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుందని వ్యాఖ్యానించారు. జైళ్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే జైల్లో ఉన్న ముద్దాయిలను ఎప్పుడంటే అప్పుడు జైల్లో నుంచి బయటికి తీసుకురావొచ్చని తెలిపారు. "ముద్దాయిలు ఆసుపత్రిలో ఏసీ రూంలో ఉండొచ్చు... వారు అన్ని సుఖాలు అనుభవించే వీలుంటుంది... తస్మాత్ జాగ్రత్త సీబీఐ" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News