Naga Shaurya: ఓటీటీలో వస్తున్న 'వరుడు కావలెను'

  • నాగశౌర్య, రీతూ వర్మ జంటగా 'వరుడు కావలెను'
  • అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలైన చిత్రం
  • జనవరి 7నుంచి జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభం
Varudu Kavalenu movie is coming in OTT

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన 'వరుడు కావలెను' చిత్రం అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ప్రేమ, కుటుంబ అనుబంధాల మధ్య నడిచే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది. జనవరి 7 నుంచి జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ కట్ ను జీ5 విడుదల చేసింది.  

ఈ సినిమాలో ఆకాశ్ పాత్రను నాగశౌర్య, భూమి పాత్రను రీతూ వర్మ పోషించారు. రీతూ వర్మకు తల్లిగా సీనియర్ నటి నదియా నటించింది. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

More Telugu News