Gorantla Butchaiah Chowdary: సినిమా టికెట్ల విషయంలో ఎందుకు అత్యుత్సాహం?: గోరంట్ల

  • అందరూ 2 రూపాయలకే న్యూస్ పేపర్ ఇవ్వాల‌ని అప్పుడు వైసీపీ పేర్కొంది
  • ఇప్పుడు సాక్షి పేపర్ 1 రూపాయికి ఇవ్వగలరా?
  • సినిమా టికెట్లు మాత్రం తక్కువ ధ‌ర‌కు ఎందుకు అమ్మాలి?
gorantla fires on ycp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా టికెట్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని టీడీపీ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌శ్నించారు. సొంత వ్యాపారం అయితే ఇలా ధ‌ర‌లు త‌గ్గించ‌గ‌ల‌రా? అని ఆయ‌న వైసీపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు.

'సాక్షి పత్రిక స్థాపించి.. అందరిని 2 రూపాయలకే న్యూస్ పేపర్ ఇమ్మని చెప్పిన వాళ్లు ఇప్పుడు సాక్షి పేపర్ 1 రూపాయకి ఇవ్వగలరా? కనీసం ఇసుమంత అయినా మనస్సాక్షి లేని సాక్షి రాతల‌కు రూ.5 పెట్టి కొనాలి. సినిమా టికెట్లు మాత్రం తక్కువ చేసి అమ్మాలి. సినిమా టికెట్ల విషయంలో ప్ర‌భుత్వానికి ఎందుకు అత్యుత్సాహం?' అని ఆయ‌న నిల‌దీశారు.

More Telugu News