పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్.. వచ్చేనెల 3 నుంచి స్కూళ్లలో టీకాలు: కర్ణాటక సీఎం బొమ్మై
- ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాం
- అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు కూడా వేస్తాం
- జనవరి 10 నుంచి అదనపు డోసు
దీంతో పలు రాష్ట్రాలు ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనిపై ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ... జనవరి 3 నుంచి రాష్ట్రంలోని స్కూళ్లలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సిన్లు వేయనున్నట్లు చెప్పారు. అలాగే, అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు జనవరి 10 నుంచి అదనపు డోసు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సూచించామని ఆయన వివరించారు.