Manchu Lakshmi: నా కిడ్నీ అమ్ముకోవాల్సివచ్చింది: మంచు లక్ష్మి

I had sell a kidney to buy flight ticket says Manchu Lakshmi
  • ఆకలి వేయకపోయినా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో తింటూనే ఉన్నా
  • ఫ్లైట్ టికెట్ కొనేందుకు కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది
  • టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు తింటూనే ఉన్నా

సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఆమె చేసే ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందని ఆమె కామెంట్ చేశారు. తాజాగా ఆమె ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. ఎక్కడకు వెళ్లిన సంగతిని వెల్లడించకపోయినా.. ఎయిర్ పోర్టులో ఏం చేసిందో మాత్రం ఆమె తెలిపారు.

'ఆకలి వేయకపోయినా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో తింటూనే ఉన్నా. ఫ్లైట్ టికెట్ కొనేందుకు నేను కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. అందుకే ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు ఆకలి కాకపోయినా తింటూనే ఉన్నా' అంటూ ట్వీట్ ద్వారా చమత్కరించారు.  

మంచు లక్ష్మి చేసిన ట్వీట్ కు నెటిజెన్లు భారీగా స్పందించారు. మీరు రిచ్ కదా అక్కా... మీరు కూడా ఇలా చేస్తారా?  అని ఒక నెటిజెన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. 'మా నాన్న రిచ్ తమ్ముడూ... నేను కాదు' అని ఆమె సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News