NV Ramana: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు.. సాదరంగా ఆహ్వానించిన జగన్ దంపతులు.. ఫొటోలు ఇవిగో!

  • విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో విందు 
  • సీజేఐకి మంత్రులను పరిచయం చేసిన సీఎం
  • కార్యక్రమానికి హాజరైన ఏపీ, టీఎస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ లు
CM Jagan felicitates CJI NV Ramana

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందును ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్వీ రమణ దంపతులకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ హైకోర్టుల చీఫ్ జస్టిస్ లు, న్యాయమూర్తులు, ఏపీ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐకి మంత్రులను జగన్ పరిచయం చేశారు.
 
మరోవైపు సీజేఐ ఎన్వీ రమణ దంపతులను రోటరీ క్లబ్ సత్కరించింది. జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. నగరంలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు ఏపీ, టీఎస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ లు హాజరయ్యారు.

More Telugu News