Jagan: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన జగన్

  • ఏపీ పర్యటనలో ఉన్న ఎన్వీ రమణ
  • కడప పర్యటనను పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న జగన్
  • సతీసమేతంగా సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం
Jagan meets CJI NV Ramana

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను ఏపీ సీఎం జగన్ కలిశారు. తన భార్య భారతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్... తన పర్యటనను ముగించుకుని ఈ మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు.

తర్వాత నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లిన జగన్... అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మరోవైపు నిన్న తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరంకు ఎన్వీ రమణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ఇరు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, పలువురు ఏపీ మంత్రులు హాజరయ్యారు.

More Telugu News