GVL Narasimha Rao: ఇప్పటి వరకు పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారు.. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారు: వైసీపీ ప్రభుత్వంపై జీవీఎల్ ఫైర్

  • ప్రతి రంగాన్ని భయపెట్టి గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నిస్తున్నారు
  • వైసీపీ అవినీతి పాలనతో అభివృద్ధి పడిపోయింది
  • తనిఖీల పేరుతో అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు
GVL Narasimha Rao fires on YSRCP

ప్రతి వ్యవస్థను, ప్రతి రంగాన్ని భయపెట్టి గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలోని పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వారిని భయపెట్టారని అన్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమపై పడ్డారని దుయ్యబట్టారు. వైసీపీ అవినీతి పాలనతో ఏపీ అభివృద్ధి పడిపోయిందని అన్నారు. తనిఖీల పేరిట అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News