Gone Prakash Rao: మధు యాష్కీపై చర్యలు తీసుకునేలా ఆదేశించండి: హైకోర్టులో గోనె ప్రకాశ్ రావు పిటిషన్

  • ఫోర్జరీ పత్రాలతో బంధువులను విదేశాలకు పంపారన్న గోనె ప్రకాశ్
  • చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నపం
  • ఇదే విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం
Gone Prakash Rao files petition against Madhu Yashki

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు వేశారు. ఫోర్జరీ పత్రాలతో బంధువులను విదేశాలకు పంపాడని తన ఫిటిషన్ లో ప్రకాశ్ రావు ఆరోపించారు. చట్టరీత్యా ఆయనపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. గతంలోనే ఈ అంశంపై ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు.

More Telugu News