Karthikeya: మళ్లీ వస్తున్న 'ఆర్ ఎక్స్ 100' కాంబో!

  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్
  • ఆ తరువాత వరుస ప్లాపులు
  • 'వలిమై' పైనే ఆశలు
  • అజయ్ సినిమాకి సన్నాహాలు  
Karthikeya in Ajay Bhupathi Movie

అజయ్ భూపతి - కార్తికేయ కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. రొమాన్స్ పాళ్లు పుష్కలంగా ఉన్న ఈ సినిమా, హీరోగా కార్తికేయను నిలబెట్టింది. అయితే ఆ తరువాత అజయ్ భూపతి చేసిన 'మహా సముద్రం' మాత్రం సక్సెస్ కి చాలా దూరంలోనే ఆగిపోయింది.

ఇక ఈ మధ్య కార్తికేయ చేసిన 'చావుకబురు చల్లగా' .. 'రాజా విక్రమార్క' సినిమాలు రెండూ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలనే ఆలోచన చేశారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను అజయ్ భూపతి రెడీ చేస్తున్నాడని అంటున్నారు.

మరోపక్క, తమిళంలో 'వలిమై' సినిమాలో అజిత్ ను ఎదుర్కునే విలన్ పాత్రలో కార్తికేయ నటించాడు. సంక్రాంతికి ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ఆ సినిమాతో కార్తికేయకి అక్కడ మంచి గుర్తింపు వస్తుంది కనుక, తెలుగుతో పాటు తమ సినిమాను తమిళంలోను విడుదల చేయాలనే ఆలోచనలో అజయ్ భూపతి ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాను జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మిస్తున్నట్టుగా టాక్.

More Telugu News