Trivikram Srinivas: ఇక త్రివిక్రమ్ బ్యానర్ నుంచి వరుస సినిమాలు!

  • దర్శకుడిగా వరుస హిట్లు 
  • సొంత బ్యానర్ ఏర్పాటు 
  • నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీమతి   
  • 'సార్' నిర్మాణంలో భాగస్వామ్యం
Sir Movie Update

త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టారు. ఆ తరువాత తనే దర్శకుడిగా మారిపోయారు. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు అన్నీ తనే. ఒక్క నిర్మాత విషయంలోనే ఆయన టెన్షన్ పడవలసి వచ్చేది. తన మిత్రులైన చినబాబు - నాగవంశీ నిర్మాతలు కావడంతో, ఇక ఆయనకి ఆ టెన్షన్ కూడా లేకుండా పోయింది. 'జులాయి' నుంచి ఈ కాంబినేషన్లోనే వరుస సినిమాలు వస్తున్నాయి.

ఇందులో త్రివిక్రమ్ కూడా ఒక భాగస్వామినే అంటూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ ఒక మాదిరి బడ్జెట్ తో సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' పేరుతో ఒక సొంత బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ పై ఇటీవలే ఒక సినిమాను కూడా ప్రకటించారు. నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాతో, కల్యాణ్ శంకర్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇక తాజాగా ఈ రోజున ధనుశ్ - వెంకీ అట్లూరి సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నిర్మాతలుగా నాగవంశీ పేరుతో పాటు, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య పేరు పడింది. ఈ సినిమాకి 'సార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

More Telugu News