Jagan: నేడు కర్నూలుకు వెళుతున్న సీఎం జగన్

  • కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకాన్నున్న జగన్
  • అక్కడే పార్టీ నేతలతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
  • జగన్ పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు భద్రత
Jagan going to Kurnool today

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కర్నూలుకు వెళుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు శివనరసింహారెడ్డి వివాహానికి హాజరుకానున్నారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్ పాఠశాలలో వివాహ వేడుక జరగనుంది.

ఉదయం 10.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 11.15 గంటలకు ఆయన కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

అక్కడే 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం 12.15 గంటలకు ఆయన తిరిగి విజయవాడకు బయల్దేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

More Telugu News