Sai Pallavi: భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేస్తూ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి క‌న్నీరు.. వీడియో వైర‌ల్

  • నిన్న శ్యామ్ సింగ‌రాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్
  • పాల్గొని మాట్లాడిన సాయిప‌ల్ల‌వి
  • త‌న‌పై ఫ్యాన్స్ చాలా ప్రేమాభిమానాలు చూపుతున్నార‌ని వ్యాఖ్య‌
  • ఈ స‌మ‌యంలో మాటలు రావడం లేదని క‌న్నీరు
Saipallavi getting emotional in  pre realize event

రాహుల్‌ దర్శకత్వం వహించిన 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో ఆ మూవీ యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. నిన్న సాయంత్రం ఫ్యాన్స్ సమక్షంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వ‌హించారు. అయితే, ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేస్తూ క‌న్నీరు కార్చడం గ‌మ‌నార్హం.

త‌న‌పై ఇంత‌మంది కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే భావోద్వేగానికి గురవుతున్నానని సాయి ప‌ల్ల‌వి చెప్పింది. 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నప్ప‌టికీ తన‌కు ఈ స‌మ‌యంలో మాటలు రావడం లేదని తెలిపింది. సినీ ప‌రిశ్ర‌మ‌ నటిగా త‌న‌ను నిరూపించుకునే అవ‌కాశాన్ని ఇచ్చింద‌ని సాయి ప‌ల్ల‌వి చెప్పింది. త‌న‌ను నమ్మి అవకాశాలు ఇస్తున్న దర్శకులందరికీ థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు తెలిపింది.

తాను చాలా క‌ష్టప‌డుతుండ‌డం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని అందరూ అంటుంటారని, అయితే, తాను ఏ సినిమానూ కష్టంగా భావించి పని చేయలేదని చెప్పింది.  తాను త‌న‌కు సినిమాలో వ‌చ్చిన‌ ప్రతి పాత్రను ఎంజాయ్‌ చేస్తూ న‌టించాన‌ని తెలిపింది.  ఈ వేదిక‌పై ఉండటమే ఓ పెద్ద అవార్డు అని ఆమె చెప్పింది.

అందుకే త‌నకు తాను క‌న్నీరు ఆపుకోలేక‌పోతున్న‌ట్లు తెలిపింది. దీంతో ఆమెను ప‌క్క‌నున్న వారు ఓదార్చారు.  కాగా, దేశంలో ఉన్న గొప్ప నటీమణుల్లో సాయిపల్లవి ఒకరని దర్శకుడు రాహుల్ అన్నారు. అంతేగాక‌, రాబోయే తరాల నటీమణులకు ఆమె ఒక లెజెండ్‌ అవుతారని కొనియాడారు.

సినిమా పట్ల సాయి ప‌ల్ల‌వికి ఉన్న‌ ప్రేమ మాట‌ల్లో చెప్పలేనిద‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు క్లాసిక్‌ డ్యాన్స్ కోసం ఉద‌యం అంతా సాధ‌న చేసి రాత్రి పూట భోజనం కూడా చేయకుండా తెల్లవారుజాము వరకూ షూటింగ్‌లో పాల్గొనేవారని ఆయ‌న చెప్పారు. కాగా, నాని హీరోగా న‌టించిన‌ 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా ఈ నెల 24న విడుద‌ల కానుంది.

  • Loading...

More Telugu News