Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసహనం!

  • పూరి తాజా చిత్రంగా 'లైగర్'
  • బాక్సర్ పాత్రలో విజయ్ దేవరకొండ 
  • కథానాయికగా అనన్య పాండే 
  • ఆగస్టు 25వ తేదీన విడుదల  
Liger movie update

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జొహార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఈ రోజు ఉదయం ప్రకటించారు.

ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించిన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్రమైన అసహనానికి లోనవుతున్నారు. ఇంత ఆలస్యం దేనికి? అనే విషయం చర్చనీయాంశమైపోయింది.

కరోనా ప్రభావం వలన ఈ సినిమా షూటింగు విషయంలోను జాప్యం జరిగింది. అయినా పూరి స్పీడ్ తెలిసిన వాళ్లంతా వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా వస్తుందని అనుకున్నారు.  కానీ ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలోకి వెళ్లిపోవడం పట్ల వాళ్లంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జొహార్ ప్రమేయమే ఇందుకు కారణమనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

More Telugu News