Narendra Modi: ఏపీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిన మోదీ

  • జంగారెడ్డిగూడెం మండలంలో వాగులోకి పడిపోయిన బస్సు
  • ఘటనలో తొమ్మిది మంది మృతి
  • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మోదీ
Modi announces exgratia to APSRTC bus death families

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం కలచివేస్తోందని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందించనున్నారు.

మరోవైపు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News