Jio: వినియోగదారులకు సంతోషాన్నిచ్చే నిర్ణయాన్ని తీసుకున్న జియో!

  • ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటా
  • వాలిడిటీ 20 రోజుల నుంచి 30 రోజులకు పెంపు
  • ఇతర టెలికాం సంస్థలకు షాకిచ్చిన జియో
Jio gives good offer to consumers

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇటీవలే టారిఫ్ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. 1 జీబీ డేటాను మొన్నటి వరకు రు. 11 కి అందించిన జియో... దాన్ని రూ. 15కి పెంచింది. దీంతోపాటు అన్ని టారిఫ్ లను ఆ సంస్థ పెంచేసి వినియోగదారులకు షాకిచ్చింది. అయితే తాజాగా తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాకిస్తోంది. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది.

More Telugu News