Jangareddy Gudem: బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించిన సీఎం జగన్

  • జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో పడిపోయిన బస్సు
  • 8 మంది మృతి చెందినట్టు సమాచారం
  • క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు   
Jagan announces 5 laks exgratia to bus accident death families

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనలో 8 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నారు. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

More Telugu News