Mahesh Babu: హైదరాబాదులోని ఖరీదైన ప్రాంతంలో ప్లాటు కొనుగోలు చేసిన మహేశ్ బాబు!

  • జూబ్లీహిల్స్ లో ప్లాటు కొనుగోలు
  • 1,442 చదరపు గజాల స్థలం కొనుగోలు
  • రూ.26 కోట్లకు డీల్
  • జాతీయ మీడియాలో కథనం
Mahesh Babu bought plot in Hyderabad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హైదరాబాదు నగరంలో ఓ ప్లాటు కొనుగోలు చేశారు. నగరంలో ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ లో రూ.26 కోట్లతో 1,442 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

ఈ స్థలం యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తికి చెందినది. ఈ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూలగొట్టిన విక్రాంత్ రెడ్డి కొత్త భవనం నిర్మించాలని భావించినా, తన నిర్ణయాన్ని మార్చుకుని మహేశ్ బాబుకు స్థలాన్ని అమ్మేశారు. దీనికి సంబంధించిన డీల్ గత నెల 17న కుదిరినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News